ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య

-

ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు.  మొదట తన తల్లిని గొంతు నులిమి చంపిన వెంకటేశ్వర్లు.. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలను దారుణంగా హత మార్చాడు. ఆస్తి తగాదాల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపేటకు చెందిన పిట్టల వెంకటేశ్వర్లు  ఆస్తి తగాదాలతో తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు నీరజ (10), ఝాన్సీ (6)లను చంపి పరారయ్యాడు. పొలం తన పేరుపై రాయాలని తల్లిని వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రెండేళ్ల  క్రితం భార్యను హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version