పిన్నెల్లికి బెయిల్.. జైలు వద్ద భద్రతను పెంచిన పోలీసులు..!

-

నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద భద్రతను పెంచారు పోలీసులు. అక్కడ రిమాండ్ ఖైదీ గా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఏపీ హైకోర్టు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో నెల్లూరు కారాగారం వద్దకు భారీగా తరలివచ్చారు పిన్నెల్లి అనుచరులు. కానీ విడుదలకు సంబందించిన సమయం ముగియడంతో పోలీసులు, పిన్నెల్లి అనుచరులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక అన్ని సవ్యంగా సాగితే రేపు పిన్నెల్లి విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇక నరసరావుపేట నుంచి బందోబస్తు కోసం ప్రత్యేకంగా వచ్చారు పోలీసు అధికారులు. పల్నాడు ప్రాంతం నుంచి పోలీసు అధికారులు రావడంతో ఆసక్తికరంగా మారాయి పరిణామాలు. డీఎస్పీ స్థాయి అధికారితో పాటూ పల్నాడు జిల్లాకు చెందిన పలువురు పోలీసులు కూడా రావడంతో.. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇతర కేసుల్లో పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news