అంబటి పై షర్మిల పరోక్ష విమర్శలు

-

రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం పట్టం కట్టడంతో ఏపీలో రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావడానికి పని చేస్తానని వైఎస్ షర్మిల చెప్పిన విషయం తెలిసిందే. ఇక నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజల కోసం పోరాడుతూనే ఉంది.

సీఎం జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే బీజేపీ, టీడీపీ, వైసీపీ పై కూడా విమర్శలు చేస్తూనే తన సొంత అన్న పార్టీ వైసీపీ పై కూడా నిప్పులను చెరుగుతుంది. తాజాగా ఏపీ నీటి పారుదల శాఖ మంత్రికి సంక్రాంతికి డ్యాన్స్ లు వేయడం తప్ప ప్రాజెక్టులు బాగోగులు చూడటం రాదని ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల విమర్శించారు. మంత్రి అంబటి రాంబాబు పేరు ప్రస్తావించకుండానే ఈమె ఈ విమర్శలు చేయడం ఇప్పుడు గమనార్హం. ప్రకాశం జిల్లాలోని మద్దిపాడులోని గండ్లకమ్మ ప్రాజెక్టును ఆమె పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని.. ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version