టిడిపికి షాక్.. సీఎం జగన్ తో భేటీ అయిన మాజీ ఎమ్మెల్యే

-

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. సీఎం జగన్ తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకట రమణ భేటీ అయ్యారు. జయమంగళను వెంట పెట్టుకుని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు మంత్రి కారుమూరి. ఇటీవలే జయ మంగళ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జయమంగళకు వైసీపీ ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ నెల 23వ తేదీన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారట జయ మంగళ. పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు జయ మంగళ. వడ్డె సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తానని ఎన్నికల సందర్భంలో సీఎం జగన్ హామీ ఇచ్చారని.. నాటి హామీ మేరకు జయమంగళకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తున్నట్టుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version