వైసీపీ నేత సుబ్బరాయుడును హత్య చేసింది టీడీపీ నేతలే – నంద్యాల పోలీసులు

-

వైసీపీ నేత సుబ్బరాయుడును హత్య చేసింది టీడీపీ నేతలే అంటూ నంద్యాల డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రకటించారు. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరుడు పసుపులేటి సుబ్బరాయుడును హత్య చేసింది టిడిపి నేత బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి అతని అనుచరులేనని వెల్లడించారు నంద్యాల డీఎస్పీ రవీందర్ రెడ్డి.

SP Adi Singh Rana visited Masidupuram and inspected the destroyed house of Subbarayadu

అటు మసీదుపురం ను సందర్శించి ధ్వంసమైన సుబ్బరాయుడు ఇంటిని పరిశీలించారు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా. నంద్యాల జి.జి.ఎచ్ .లో సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను విచారించిన ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా. అర్థరాత్రి సమయంలో శ్రీనివాసరెడ్డి అతని అనుచరులు సుబ్బరాయుడు ఇంటిపై దాడి చేసి చంపారన్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకుంటామని అటు నంద్యాల డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటెయ్యనందుకే హత్య జరిగినట్లు తెలుస్తుందన్నారు నంద్యాల డీఎస్పీ రవీందర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version