స్వరూపానందస్వామి ఆశీస్సులు తీసుకున్న విడదల రజని..!

-

విశాఖ శారదా పీఠం స్వరూపానందెంద్ర స్వామి ఆశీస్సులు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి.. విడదల రజిని తీసుకున్నారు. విశాఖ లోని శారద పీఠానికి వెళ్లిన ఆమె స్వరూపానంద పాదాలకు నమస్కరించారు. విడుదల రజిని… మంత్రి పదవి చేపట్టిన తర్వాత స్వరూపానంద ఆశీర్వాదాలు తీసుకుని ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆమెతో స్వరూపానంద కాసేపు ముచ్చటించారు.

బాగున్నారా అని స్వరూపానంద ప్రశ్నించగా… మీ ఆశీర్వాదాలు వల్ల జగనన్న బాగుంటే అందరం బాగుంటం అని ఆమె చెప్పారు. ఆ తర్వాత విడుదల రజిని కి స్వరూపానంద చీరను బహుకరించారు. దీనికి సంబంధించిన సోషల్ వీడియో లో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు మరో మంత్రి కూడా స్వరూపానంద ఆశీర్వాదాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version