జగన్ కళ్లలో ఆనందం చూడ్డానికే కేటీఆర్ అలా మాట్లాడారు : టీడీపీ నేతలు

-

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఉద్దేశిస్తూ.. ఏపీ రాజకీయాలతో తెలంగాణకేం సంబంధం అంటూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. కేటీఆర్ కామెంట్స్​పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూసేందుకే కేటీఆర్ అలా వ్యాఖ్యానించారని మండిపడ్డారు. చంద్రబాబు కోసం తెలంగాణలో జరిగే శాంతియుత ర్యాలీలను కేటీఆర్ ఆపలేరని అన్నారు.

కేటీఆర్‌ మాట్లాడింది చూస్తుంటే.. తెలంగాణలో ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నట్లు కనిపిస్తోందని పలువురు టీడీపీ నేతలు అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను హైదరాబాద్ ప్రజలు.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు గమనిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ చేసిన నిరసన ర్యాలీలో పాల్గొనలేదా..? పలువురు బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించలేదా.. అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కృషి ఫలితంగానే హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందనే విషయాన్ని మరిచిపోయారా కేటీఆర్ అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version