World Cup 2023 : పాకిస్థాన్‌ ప్లేయర్లకు హైదరాబాద్‌ మంచి ట్రీట్‌ !

-

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత భారత్ కు వచ్చిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తమ అభిమాన ఆటగాళ్లను చూసెందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు.

Hyderabad is a good treat for Pakistani players

పోలీసులు మూడు అంచల భద్రత నడుమ ప్లేయర్లను పార్క్ హయాత్ హోటల్ కు తీసుకెళ్లారు. అభిమానుల ప్రేమ, సపోర్ట్ ఎంతో బాగుందని, పాక్ కెప్టెన్ బాబర్ అజమ్, కీపర్ మహమ్మద్ రిజ్వాన్, పేసర్ షాహిన్ ఆఫ్రిది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక అటు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు హైదరాబాద్ కు చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బేగంపేటలోని ఐటిసి కాకతీయకు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు రాత్రి అక్కడే బస చేయనుంది. ప్రపంచ కప్ మ్యాచ్ల నిర్వహణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ జట్టు హైదరాబాద్ చేరుకోగా… ఈ రెండు జట్లు రేపు మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version