TDP, జనసేన సీట్ల సర్దుబాటుపై కీలక నిర్ణయం

-

TDP, జనసేన సీట్ల సర్దుబాటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ కమిటీ వేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కోసం ఇరుపక్షాల నుంచి ఐదేసి మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. సీట్ల సర్దుబాటు కోసం రెండు పార్టీల నాయకులు సమావేశమై మాట్లాడుకోవడం తమ పార్టీ నాయకత్వానికి ఆశనీపాతమని పేర్కొన్నారు.

ఈ సంఘటనను తమ పార్టీ పెద్ద రెడ్లు ఊహించి ఉండరని, దీనితో తమ పార్టీకి చెందిన కాపు నాయకులతో పవన్ కళ్యాణ్ గారిని, కమ్మ, ఇతర నాయకులతో లోకేష్ గారిని తిట్టిస్తారని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. జైలులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన సతీమణి భువనేశ్వరి గారు, కోడలు బ్రాహ్మణి గారు విషం కలిపే అవకాశం ఉందని తమ పార్టీ నేతలు ప్రచారం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని లోకేష్ గారు అన్నారని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు విష ప్రయోగం చేసే అవకాశాలు ఉన్నాయని తాను కూడా గతంలో హెచ్చరించానని, ఇప్పుడు లోకేష్ కూడా అదే విషయాన్ని చెబుతున్నారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version