కడపలో టీడీపీ మహానాడు జరుగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ ఐంది. దీనిపై తాజగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ పూర్తి చేస్తామని తెలిపారు చంద్రబాబు నాయుడు. మిగిలిన నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లదించారు. మే 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు.