తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫార్మసీ రిజిస్ట్రీ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయబోతోంది. అయితే ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రంలో.. సోమవారం అంటే ఇవాళ ప్రారంభించబోతోంది. ఆధార్ కార్డుకు లింక్ అయిన పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా రైతులకు కార్డులు ఇవ్వబోతోంది మోడీ ప్రభుత్వం.

ఇక దీనిని ఇవాల్టి నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయాలలో నమోదు చేసుకోవచ్చు. అనంతరం త్వరలోనే మీ సేవ కేంద్రాల్లో కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించనున్నారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం రైతులకు అమలు చేయబోయే… అన్ని సంక్షేమ పథకాలకు ఈ కార్డులు చాలా కీలకము కాబోతున్నాయి. అందుకే ఈ గుర్తింపు కార్డులు జారీ చేయనుంది మోడీ ప్రభుత్వం.