BREAKING: వరదలో చిక్కుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్..!

-

BREAKING: వరదలో చిక్కుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ప్రజలను కాపాడబోయి… వరదలో చిక్కుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రజలను వరద బాధితులను పరిరక్షించే దిశగా సహాయక చర్యలు తీసుకుంటుండగా ఒరవడి వల్ల నీళ్ళల్లో చిక్కుకున్నారు ఎమ్మెల్యే బోడె ప్రసాద్.

TDP MLA Bode Prasad trapped in flood

అయితే.. అక్కడే ఉన్న వారు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ను కాపాడగలిగారు. ఇక అటు విజయవాడ ప్రజలను కాపాడేందుకు పంజాబ్‌ నుంచి విజయవాడకు చేరాయి NDRF బృందాలు. కాసేపటి క్రితమే… విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు NDRF బృందాలు చేరుకున్నాయి. పంజాబ్ నుంచి వచ్చిన NDRF బృందాలు వరద సహాయక చర్యల్లో వంద మంది సిబ్బంది పాల్గొనున్నారు. కాగా, ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులుగా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version