ఆ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేకి సీఎం బాబట !

-

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన పొరపాటు నవ్వులు పూయించింది. జీవీఎంసీ స్వచ్చ మహోత్సవ్ వేదిక మీద మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన చెప్పుకోచ్చారు. అంతలోనే జరిగిన తప్పు తెలుసుకున్న ఆయన పక్కన ఉన్న అందరికీ క్షమాపణ చెప్పారు. అనంతరం తిరిగి తన ప్రసంగాన్ని కొన సాగించారు.

అదే వేదిక మీద ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు వున్నారు. ఎమ్మెల్యే పొరపాటున అలా అనడం ఆయనతో పాటు సభకు హాజరైన వారంతా గుర్తించారు. దీంతో ఆ వేదిక మీద కాసేపు నవ్వులు విరిశాయి. ఇటీవలే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీనీ వీడి వైఎస్ఆర్‌సీపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన చూసి,చాలా మంది శాసనసభ్యులు పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news