జనసేనకు 25 స్థానాలే ఇస్తామంటూ టీడీపీ మొండి పట్టు ?

-

జనసేనకు 25 స్థానాలే ఇస్తామంటూ టీడీపీ పార్టీ మొండి పట్టుకుని కూర్చున్నట్లు సమాచారం అందుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే.. అన్ని పార్టీలు అభ్యర్థులు, సీట్ల కేటాయింపుపై ఫోకస్‌ పెట్టాయి. అయితే.. తాజాగా సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టాయి టీడీపీ-జనసేన పార్టీలు. ఇందులో భాగంగానే… కాసేపట్లో అమరావతిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.

TDP stubborn to give only 25 seats to Jana Sena

ఈ సందర్భంగా సీట్ల కేటాయింపులపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. ఇక అటు జనసేనకు 25 స్థానాలు ఇస్తామంటున్నారు టీడీపీ పార్టీ నేతలు. కానీ ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబడుతున్నారట పవన్ కళ్యాణ్‌. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్‌. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని పట్టుబడుతున్న పవన్.. ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబడుతున్నారట. ఇక దాదాపు సీట్ల సర్దుబాట్లు.. కొలిక్కివచ్చినట్లు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై క్లారిటీకి రానుందని టీడీపీ-జనసేన చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news