తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్.. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

-

అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని.. గతంలో తాను చూపించిన చొరవ వల్లే తెలంగాణ ఈ పరిస్థితిలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజన్ 2047 డాక్యుమెంట్పై అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో తాను చూపించిన విజన్ వల్లే తెలంగాణ ఈ పరిస్థితిలో ఉందన్నారు. వికసిత్ భారత్ 2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలన్నారు. తలసరి ఆదాయం 18 వేల డాలర్లు ఉండాలన్నారు.

నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ ను అమలుపరిచే – బాధ్యత ఎమ్మెల్యేలదేనన్నారు. ఎమ్మెల్యేలకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షలు ఉండాలన్నారు. ఆ సమయానికి 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు ఏపీ చేరాలన్నారు. అలాగే రూ.308 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు చేశామని.. ప్రతీ ఏటా రూ.15 శాతం వృద్ధి రేటు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు సీఎం చంద్రబాబు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version