అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని.. గతంలో తాను చూపించిన చొరవ వల్లే తెలంగాణ ఈ పరిస్థితిలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజన్ 2047 డాక్యుమెంట్పై అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో తాను చూపించిన విజన్ వల్లే తెలంగాణ ఈ పరిస్థితిలో ఉందన్నారు. వికసిత్ భారత్ 2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలన్నారు. తలసరి ఆదాయం 18 వేల డాలర్లు ఉండాలన్నారు.
నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ ను అమలుపరిచే – బాధ్యత ఎమ్మెల్యేలదేనన్నారు. ఎమ్మెల్యేలకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షలు ఉండాలన్నారు. ఆ సమయానికి 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు ఏపీ చేరాలన్నారు. అలాగే రూ.308 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు చేశామని.. ప్రతీ ఏటా రూ.15 శాతం వృద్ధి రేటు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు సీఎం చంద్రబాబు.