ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు విషయంలో కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడవు 10 సంవత్సరాలకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో 8 సంవత్సరాల పాటు మాత్రమే ఈ గడువు ఉండేది.

దింతో రెండు సంవత్సరాల పాటు అదనంగా పెంచింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించలేదని ఏటా ఏప్రిల్ నెలాఖరుకల్లా విద్యాసంస్థలు అఫీడవిట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అలా సమర్పించకపోతే పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా ప్రవేట్ స్కూల్స్ గుర్తింపును 10 సంవత్సరాల పాటు అదనంగా పెంచుతామని ఇప్పటికే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. ఆ హామీ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.