ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ రసవత్తర ఫైట్ జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. చండీగర్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

అయితే.. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 లో పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడుతుంది. అందులో గెలిచినట్టు ఫైనల్ కు వెళ్తుంది. జూన్ మూడో తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో… ఫైనల్ ఆడుతుంది. ఇంకా ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ నేపథ్యంలో మొదటి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ తీసుకున్న జట్టు విజయం సాధించే ఛాన్సులు ఎక్కువ.