అంగన్వాడిల విషయంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలలో జులై 1వ తేదీ నుంచి మంచి పోషకాహార పంపిణీకి ఫేషియల్ రికగ్నిషన్ ముఖ గుర్తింపు తప్పనిసరి ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఎంత మంది బాలలు అంగన్వాడీలలో పౌష్టికాహారం తీసుకుంటున్నారో తెలియజేయాలని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నెల 30వ తేదీ నుంచి లబ్ధిదారుల ప్రొఫైల్ లో ఫేస్ అతేంటికేషన్ ఫీచర్ అందుబాటులోకి రాబోతున్నట్లుగా వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి గర్భిణీలు, పిల్లల నమోదులోను ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తాజా నిర్ణయంతో అంగన్వాడీలలో ఎవరెవరు పౌష్టికాహారం తీసుకుంటున్నారో లేదో సులభంగా తెలిసిపోతుంది.