మనిషిని కాటేసి ఓ విషపూరితమైన పాము చనిపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే….బాలఘాట్ లోని ఖుద్సోడి గ్రామంలో సచిన్ నాగ్ పురే అనే యువకుడిని ఓ విషపూరితమైన పాము కాటేసి చనిపోయింది. యువకుడు పాము కాటుకు గురైనప్పటికీ అతనికి ఏమీ కాలేదు. బదులుగా ఆ పామే చనిపోయింది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

బలంగా పాము కాటేసిన సమయంలో కొరలపై ఒత్తిడి పడి అది మరణించే అవకాశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, పాము కాటుకు గురైన సదరు వ్యక్తి చాలా ఔషధ మూలికలతో పళ్ళు తోముకుంటానని రక్తంలో ఔషధాలు మిళితమై ఉన్న కార ణంగా ఇలా జరిగి ఉంటుందని సచిన్ నాగ్ పురే అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారుతుంది.