ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మిగిలిన డబ్బులను వారం రోజులలోగా ప్రభుత్వానికి జమ చేయాలంటూ సెర్ప్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ పంపిణీ ప్రక్రియ పూర్తయిన వెంటనే డబ్బులను జమ చేయాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జూన్ నెలలో ఇంకా నాలుగు కోట్లు సెర్ప్ ఖాతాకు చేరాల్సి ఉంది. గతంలో కొందరు ఉద్యోగులు నిధులతో ఉడాయించిన ఘటనలో ఇదివరకే జరిగాయి. దీంతో కొత్త రూల్ తీసుకోవచ్చారు అధికారులు. ఇదిలా ఉండగా…. ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయబోతున్నారు. దీంతో రైతులు సంతోషపడుతున్నారు.