కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చి ఉంటే ఇజ్జత్ పోయేదని బాంబు పేల్చారు. తెలంగాణ పరువు మంట కలిసేదని పేర్కొన్నారు. కూలిపోయిన ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సిగ్గు లేకుండా అడుగుతున్నారన్నారు.

కాళేశ్వరం ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత..? ఇప్పుడు పంట దిగుబడి ఎంత..? అని నిలదీశారు బండి సంజయ్. కాళేశ్వరం లేకపోయినా పంట దిగుబడి ఎందుకు పెరిగింది..? కాళేశ్వరం వల్ల ఏం లాభమో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు బండి సంజయ్.
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చి ఉంటే ఇజ్జత్ పోయేది
తెలంగాణ పరువు మంట కలిసేది
కూలిపోయిన ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సిగ్గు లేకుండా అడుగుతున్నారు
– బండి సంజయ్ pic.twitter.com/eFQRUhf7Gc
— BIG TV Breaking News (@bigtvtelugu) June 22, 2025