టీటీడీ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల జీతాలు 15 వేలకు పెంపు

-

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్య0గా రూ. 5,141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపింది.

The key decision of TTD The salary of those employees will be increased to 15 thousand

పోటీ విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి. రూ. 30కోట్లతో గోగర్భం- ఆకాశగంగ వరకు నాలుగు వరుసలు నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు టీటీడీ పాలకమండలి అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news