రైల్వేస్టేషన్ లిఫ్టులో ఇరుక్కుపోయిన ప్రయాణికులు.. 3 గంటలు నరకయాతన అనుభవించారు. ఈ సంఘటన ఏపీలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం మారేందుకు 14 మంది ప్రయాణికులు లిఫ్ట్ ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో ఆగిపోయింది లిఫ్ట్.
తలుపులు తెరుచుకోకపోవడంతో.. దాదాపు 3 గంటలు అందులోనే ఉండిపోయింది సదరు ప్రయాణికులు. ప్రయాణికులు కేకలు విని లిఫ్ట్ వద్దకు వచ్చారు పోలీసులు. టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడారు పోలీసులు. ఇక ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
రైల్వేస్టేషన్ లిఫ్టులో ఇరుక్కుపోయిన ప్రయాణికులు.. 3 గంటలు నరకయాతన..
ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం మారేందుకు లిఫ్ట్ ఎక్కిన 14 మంది ప్రయాణికులు
పరిమితికి మించి ఎక్కడంతో ఆగిపోయిన లిఫ్ట్
తలుపులు తెరుచుకోకపోవడం.. దాదాపు 3 గంటలు అందులోనే ఉండిపోయిన ప్రయాణికులు… pic.twitter.com/I855jnfR3v
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2025