నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..బాబు కూడా!

-

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లానున్నారు. ఈ రోజు, రేపు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి. గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు ఉన్నారు.

Telangana CM will participate in Delhi election campaign today and tomorrow

కర్ణాటక, తెలంగాణ తరహాలో ఢిల్లీలో కాంగ్రెస్ గ్యారెంటీలతో కూడిన హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇందులో భాగంగానే…. ఈ రోజు, రేపు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి. ఇక అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పయనం అవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.55కు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news