శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక తిరుమలలో గదుల ధర రూ.150కి తగ్గింపు !

-

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. తిరుమల అష్ట వినాయక అతిధి గృహాన్ని సామాన్య భక్తులుకు కేటాయించేలా వాటి ధరను 150 రూపాయలకు తగ్గిస్తూన్నామని టీటీడీ పాలక మండలి ఇఓ దర్మారెడ్డి ప్రకటించారు. వికాస్ నిలయంలో అతిధి గృహాని 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికరణ చేస్తూన్నామని చెప్పారు టీటీడీ పాలక మండలి ఇఓ దర్మారెడ్డి.

ttdp

ఆగస్ట్‌ నెలలో 22.25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా….హుండి ద్వారా 120.05 కోట్లు ఆదాయం లభించిందని పేర్కొన్నారు. కోటి తోమ్మిది లక్షల లడ్డులు విక్రయించాయని…43.07 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని చెప్పారు. 9.07 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఇఓ దర్మారెడ్డి ప్రకటించారు. తిరుమల శ్రీవారి అభిషేకాని వినియోగించే పాలను టిటిడి గోశాల నుంచి సేకరిస్తూన్నామన్నారు ఇఓ దర్మారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news