జనసేన పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను…క్లారిటీ ఇదే

-

జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరబోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని, తాను వైసీపీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. వదంతులు నమ్మవద్దని కోరారు.


నేను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని..ఇది నాపై జరుగుతున్న దుష్ప్రచారం అన్నారు. నేను వైసీపీలోనే ఉన్నాను…వైసీపీలోనే నేను కొనసాగుతానని స్పష్టం చేశారు. నేను పార్టీ మారుతున్నట్టు ఎవరికీ చెప్పలేదు, కావాలని ఇది ప్రచారం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను.  కాగా, జగ్గయ్యపేట టికెట్ ఈసారి ఉదయభానుకు కాకుండా కొత్త వారికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరి, పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news