పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పడేసేందుకు పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారు – డిప్యూటీ సీఎం కొట్టు

-

2024లో జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సహా చాలా మంది ఖాతాలు మూయిస్తామని అన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. అమరావతి నిర్మాణంలో భాగస్వామి అవుతుందని ప్రకటించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సొంత దేశంలోనే అరెస్టు అయ్యారని.. ఇక్కడ అమరావతి భూముల వ్యవహారంపై దర్యాప్తు వేగంగా జరుగుతోందని తెలిపారు.

అవాకులు చెవాకులతో పవన్ కల్యాణ్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని.. ఆయన గ్రాఫ్ పడేసేందుకు పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పవన్ ను శాశ్వతంగా అడ్డు తొలగించుకునేందుకు ఆయనతో లేని పోని ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు మంత్రి కొట్టు. చంద్రబాబును వదిలేస్తేనే పవన్ కళ్యాణ్ కి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. రాబోయే ఎన్నికలలో మళ్లీ వైసీపీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని భీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version