కక్షపూరితంగానే నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు.. జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు

-

కక్షపూరితంగానే నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి ఘటన కేసుకు సంబంధించి పోలీసు విచారణకు హాజరయ్యారు జోగి రమేష్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అటాచ్ చేయబడిన అగ్రిగోల్డ్ భూములను మళ్లీ వేరే వారికి రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యమయ్యే పనేనా? అని ప్రశ్నించారు.

ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై, టిడిపి నాయకుడు అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. నిరసన తెలియజేయడానికి, చంద్రబాబు ఇంటికి వెళ్లాను. చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళింది దాడి చేయడానికి కాదు.. అప్పుడు నా మీదే దాడి చేశారని తెలిపారు. జోగి రమేష్ చరిత్రలో అలాంటి ఘటనలు లేవు. చంద్రబాబు ఇంటి వద్ద ఘటనకు సంబంధించి పోలీసులు ఏ వివరాలు అడిగినా ఇస్తాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మందితో ఫోన్లు సంభాషించే వాడిని. ఆ సమాచారం కూడా ఇస్తాను.ఇందులో దాపరికాలు, దాచుకోవటాలు ఏమీ లేవని తెలిపారు జోగి రమేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version