దోమలతో కుట్టించి జైల్లో చంద్రబాబును చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు – నారా లోకేశ్

-

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్టుపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చంద్రబాబుకు జైల్లో ముప్పు ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు.

చంద్రబాబుకు హాని తలపెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి అన్నారు. జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇటీవల రిమాండ్ ఖైదీ సత్యనారాయణ డెంగీ బారిన పడి చనిపోయాడు. బాబుగారికి ఇలాగే చేయాలనేది సైకో కుట్ర అని ట్విటర్ లో నారా లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబుకు గారికి ఏం జరిగినా సైకో జగన్‌దే బాధ్యత అని లోకేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం లోకేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version