BREAKING : అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

-

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనడంతో ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

కడప నుంచి కారులో తాడిపత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు. మృతులను తాడిపత్రికి చెందినవారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టడం వల్ల చోటుచేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో లారీ డ్రైవర్ నిద్ర మత్తుల్లో ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version