శ్రీవారి భక్తులకు అలర్ట్‌..నేటి నుంచి 17 వరకు తిరుపతి జిల్లాకు భారీ వర్షాలు !

-

తిరుమల శ్రీ వారి భక్తులకు అలర్ట్‌. ఈ నెల అక్టోబర్ 14 అంటే ఇవాళ్టి 17 వరకు తిరుపతి జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. ఈ తరుణంలోనే… మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్ళరాదని కోరారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్దంగా వుండాలని తెలిపారు. ఎట్టి పరిస్థితిలోనూ మానవ, పశు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదన్నారు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్.

జిల్లాలోని పలు జలపాతాల పర్యాటక ప్రాంతాలైన కైలాసకోన, అరై, తలకోన తదితర వాటర్ ఫాల్స్ నందు, సముద్ర బీచ్ ప్రాంతాల నందు అక్టోబర్ 14 నుండి 17 వరకు నాలుగు రోజుల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యాటక సందర్శకులకు అనుమతి లేదని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ నందు 24X7 కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు….నంబర్ 08772236007 అందుబాటులో ఉంటుందని.. అధికారులు సెలవుల్లో వుంటే వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్.

Read more RELATED
Recommended to you

Latest news