తిరుమలలో భక్తుల రద్దీ.. అన్నీ కంపార్ట్మెంట్లు ఫుల్

-

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో అన్నీ కంపార్ట్మెంట్లు ఫుల్ అయ్యాయి. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. దీంతో టోకేన్ లేని తిరుమల శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

15 hours time for Sarvadarshan of Tirumala Srivari

అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 85825 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 36146 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 4.4 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు తిరుమలలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఆగస్ట్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనుంది టిటిడి. ఇవాళ ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్లను కూడా విడుదల చెయ్యనుంది టిటిడి. అటు
మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి.

Read more RELATED
Recommended to you

Exit mobile version