తిరుమల శ్రీ వారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లలో వేచివున్నారు తిరుమల భక్తులు. తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 46, 927 మంది భక్తులు దర్శించుకున్నారు.
21,560 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 2.97 కోట్లుగా నమోదు ఐంది. ఇక అటు తిరుమలలో 16వ తేదీ నుంచి ధనుర్మాస నెల ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ నుంచి నెల రోజులు పాటు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ బదులుగా స్వామివారికి తిరుప్పావైతో మేల్కోలుపు ఉంటుంది.
- తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 46927 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 21560 మంది భక్తులు
- హుండి ఆదాయం 2.97 కోట్లు