నేడే శ్రీవారి నవంబర్ నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినెల.. 3 నెలల ముందుగానే ఆన్ లైన్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ నెలకు సంబంధించిన పలు ఆర్జిత సేవల టికెట్లను ఇవాళ విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన.. శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు కోటాను ఆగస్టు 19న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల దాకా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ టికెట్లు దక్కించుకున్న వారు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా డబ్బులు చెల్లించాలని పేర్కొంది. డబ్బు చెల్లించిన వారికే లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని స్పష్టం చేసింది.

మరోవైపు ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నారు. నవంబరు 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగం సేవ టికెట్లను కూడా అదే రోజు మధ్యాహ్నం విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version