ఇవాళ తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెట్లు విడుదల

-

తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్. భక్తుల కోసం టీటీడీ అధికారులు వివిధ రకాల ప్రత్యేక టికెట్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు తిరుమల, తిరుపతిలో వసతికి సంబంధించి టికెట్లు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆయా సమయాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు తిరుమలలో రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం రోజున శ్రీవారిని 60,371 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారికి 20,301 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు. ఇక తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.09 కోట్లు సమకూరినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news