శ్రీవారి భక్తులకు అలర్ట్..తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది.

శ్రీనివాసుని దర్శనం కోసం 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 75,594 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 26,213 మంది తలనీలాల సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 4.69 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది. కాగా, ఇవాళ టిటిడి చైర్మన్ గా భాధ్యతలు స్వీకరించనున్నారు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి. ఉదయం 11.44 గంటలకు గరుడాళ్వార్ సన్నిధిలో ప్రమాణస్వీకారం చేస్తారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version