TTD ఛైర్మన్‌ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన ?

-

TTD ఛైర్మన్‌ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియామకం కానున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం ను కలిశారు భూమన. వచ్చే నెల12 తో టీటీడీ ఛైర్మన్, పాలకమండలి పదవీకాలం ముగియనుంది.

ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు ఎమ్మెల్యే భూమన. టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తోన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి. ఇక వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయనని ఇప్పటికే స్పష్టం చేశారు భూమన. తన కుమారుడికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు భూమన. తనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని సీఎంను భూమన అడిగినట్లు సమాచారం. మరి దీనిపై సీఎం జగన్‌ ఎలాంటి నిర్నయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news