వరద బాధితులకు సీఎం జగన్‌ శుభవార్త..వారి కోసం రూ.12 కోట్లు విడుదల

-

వరద బాధితులకు సీఎం జగన్‌ శుభవార్త చెప్పారు. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో…. గోదావరి ప్రభావిత జిల్లాలకు అత్యవసర సహాయక చర్యలకు 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

అలాగే… అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు ఆహారం, నీరు, పాలు, హెల్త్ క్యాంపు, శానిటేషన్ కోసం నిధులు మంజూరు చేసింది జగన్‌ ప్రభుత్వం. అల్లూరి 3, తూర్పుగోదావరి1, కోనసీమ 3, ఏలూరు3, పశ్చిమ గోదావరి 2 కోట్లు అంటే మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు GO జారీ చేశారు రెవిన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఐఏఎస్.

Read more RELATED
Recommended to you

Latest news