శ్రీవారి భక్తులకు అలర్ట్..తిరుపతిలో ఇవాళ్టి నుంచి దర్శనం టోకెన్లు రద్దు

-

 

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది టీటీడీ పాలక మండలి. తిరుపతిలో ఇవాళ్టి నుంచే దర్శనం టోకెన్లు బంద్‌ చేయనుంది టీటీడీ పాలక మండలి. తిరుమలలో భక్తుల రద్ది దృష్యా ఇవాళ, రేపు,13,14,15వ తేదిలలో తిరుపతిలో జారి చేసే సర్వదర్శన టోకేన్లు రద్దు చేసింది టిటిడి. ఇక అటు తిరుమలలో 14వ తేదిన నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

ఈ నెల 15వ తేది నుండి 23వ తేది వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 19వ తేదిన గరుడ వాహన సేవ, 20వ తేది సాయంత్రం పుష్పకవీమానం, 22వ తేది ఉదయం స్వర్ణరథ ఉరేగింపు నిర్వహిస్తారు. 23వ తేది చక్రస్నానంతో ముగియనున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు. అటు అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శ‌ర‌న్న‌వరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అక్టోబ‌ర్‌ 15 నుంచి 24వ తేది వరకు పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version