తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్‌..ఇవాళ టికెట్లు విడుదల

-

తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్‌. ఇవాళ ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనుంది టిటిడి. ఇవాళ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చేయనున్నారు. అలాగే ఇవాళ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల కానున్నాయి.

 

ఇక మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. రేపు 300 రుపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది టిటిడి. ఆగష్ట్‌,సెప్టెంబర్ నెలకు సంబంధించి రోజుకు 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లు విడుదల చేయనుంది టిటిడి. అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకు 15 వేల చొప్పున టికెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి.

Read more RELATED
Recommended to you

Latest news