తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

-

తిరుపతి నుంచి కాట్పాడి వరకు రూ.1,332 కోట్లతో డబ్లింగ్‌ పనులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి కేంద్రం ఆమోదిం తెలిపినట్లు తెలియజేస్తూ ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట క్షేత్రాలకు లక్షల్లో భక్తులు తరలి వస్తారని తెలిపారు. తిరుపతి, వెల్లూరు ప్రాంతాలు వైద్య, విద్య హబ్‌లుగా ఉన్నాయని.. దీంతో రాయలసీమ రీజియన్‌కు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు.

“ఈ మార్గంలో పనులు పూర్తయితే ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌, స్టీల్‌ తయారీ కంపెనీలు కూడా లబ్ధి పొందుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాలు బెనిఫిట్ అవుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 17 మేజర్‌, 327 మైనర్‌ వంతెనలు వస్తున్నాయి.  7 పైవంతెనలు, 30 అండర్‌ పాస్‌ బ్రిడ్జ్‌లు రానున్నాయి. 104 కి.మీ మార్గం రోడ్డుకు బదులు రైలు మార్గానికి రద్దీ మళ్లుతుంది. దాని వల్ల 20 కోట్ల కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ తగ్గుతుంది. 4 కోట్ల లీటర్ల డీజిల్‌ పొదుపు అవుతుంది.” అని కేంద్రమంత్రి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news