అత్తగారి ఉసురు తగిలి.. వైయస్ భారతి కోర్టులో నిలబడబోతోంది : వంగలపూడి అనిత

-

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల, విజయమ్మ, సునీతలకు పట్టిన గతి భారతికి పట్టకూడదని కోరుకుంటున్నానని.. సీఎం జగన్ చేసిన అవినీతి అక్రమాల్లో సహధర్మచారిని భారతిని బలిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ భార్య అయినందుకు ఆమె కోర్టు బోనులో నిలబడే పరిస్థితి వస్తోందని… జగన్ అవినీతి అక్రమాలతో సంపాదించిన ఆస్తులకు భారతిని యజమానురాలుగా పెట్టడంతో ఆమె పరిస్థితి చూస్తే జాలేస్తోందని ఫైర్ అయ్యారు.

తోటి ఆడపడుచులు, అత్తగారి ఉసురు భారతికి తగులుతోందని.. అన్న సీఎం అయ్యేందుకు ఎంతో కష్టపడిన జగన్ చెల్లి షర్మిల ప్రాణ రక్షణ కోసం పక్కరాష్ట్రంలో తలదాచుకుంటోందని అగ్రహించారు.

జగన్ అనుమతి లేనిదే సొంత రాష్ట్రంలో అడుగుపెట్టలేని దుస్థితి తల్లి విజయమ్మదని.. వివేకా హత్య కేసులో న్యాయం చేస్తానని మరో చెల్లి సునీతను దారుణంగా మోసగించారన్నారు. ఇప్పటికే సొంత చెల్లెల్లు, తల్లిని రాష్ట్రంలో అక్క చెల్లెల్ని దారుణంగా జగన్ వంచించినందున భారతి అయినా జాగ్రత్త పడాలని కోరారు. జగన్ తల్లి, చెల్లెళ్లతో పాటు రాష్ట్రంలో ప్రతీ ఆడపడుచుకు న్యాయం చేసే నాయకుడు చంద్రబాబు మాత్రమేనని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version