ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం కంపెనీలకు వరద బాధితుల తాకిడి..!

-

బెజవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం కంపెనీలకు వరద బాధితులు క్యూ కట్టారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల నుంచి క్లెయిమ్ కోసం బాధితులు వస్తున్నారు. అయితే ఈ విషయం పై ఇన్సూరెన్స్ సర్వేయర్ మధుబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వరదల్లో పాడైన వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్ 12 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోంది. ఒన్ డ్యామేజ్ పాలసీ తీసుకున్న వారికి వరదల్లో నష్టపరిహారం వస్తుంది. సుమారు విజయవాడ పరిధిలో 10 వేలకి పైగా వాహనాలకు ఇన్స్యూరెన్స్ క్లైయిమ్ కోసం వస్తారని అంచనా.

ఇక వ్యాపారులకు జరిగిన నష్టానికి స్టాక్స్ ఇన్స్యూరెన్స్ బట్టి పరిహారం వస్తుంది. ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లించిన పెయింట్స్, రబ్బరు పరిశ్రమ, పెట్రోల్ బంకులు వంటి అనేక పరిశ్రమలు క్లెయిమ్ చేయటానికి సిద్ధమవుతున్నాయి. క్లైయిమ్ కోసం బాధితులు ఇన్స్యూరెన్స్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. కానీ వరద వల్ల నష్టం అంచనా వేయటం సాధ్యం కానీ పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారులకు మిస్ లీనియస్ & షాప్ కీపర్స్ పాలసీ సెక్షన్ 1బీ కింద మాత్రమే క్లెయిమ్ వస్తాయి. ఫైర్ పాలసీ ఉన్న వారికి కూడా క్లెయిమ్ వర్తిస్తాయి అని మధుబాబు తెలియజేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version