విజయనగరం రైలు ప్రమాదానికి లోకో పైలట్ క్రికెట్ చూడటమే : అశ్విని వైష్ణవ్

-

విజయనగరంలో గత ఏడాది ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 2023 లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పలాస పాసింజెర్‌ను రాయగడ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. దీంతో మూడు బోగీలు బోల్తా కొట్టాయి. ఇక విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Vizianagaram-Train-Derailment-1536×908

అయితే.. తాజాగా విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదానికి కారణం లోకో పైలట్ క్రికెట్ చూస్తుండటమేనని వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్ మరియు అసిస్టెంట్ లోకో పైలట్ ఇద్దరూ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news