గన్నవరం నియోజక వర్గాన్ని గచ్చిబౌలిలా తయారు చేస్తా – యార్లగడ్డ వెంకట్రావు

-

గన్నవరం నియోజక వర్గాన్ని గచ్చిబౌలిలా తయారు చేస్తానని ప్రకటించారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంపురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భావన సముదాయాలను ప్రారంభోత్సవం చేసిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు…..అనంతరం మాట్లాడారు. 43 లక్షలు ప్రభుత్వ నిధులు గ్రాంట్ అయితే, గ్రామంలో 9 లక్షలు చందాలు వేసుకుని ఈ పంచాయతీ కార్యాలయం భవనాలను నిర్మించడం జరిగింది.

yarlagadda in gannavaram

పంచాయతీ కార్యాలయ స్థల దాతలు కొల్లి రాజబాబు , బసవ పూర్ణయ్య గారికి ధన్యవాదాలు అన్నారు. ఊరికి మంచి చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడే పంచాయతీ కార్యాలయానికి స్థలాన్ని ఆ రోజుల్లోనే దానం ఇచ్చిన వారిని, నేటితరం యువత రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రాబోవు 9 నెలలో అంతర్జాతీయ టెర్మినల్ పనులు పూర్తి చేస్తామని.. టెర్మినల్ పనులు 9 నెలలలో పూర్తి కాకపోతే, సమావేశం ఏర్పాటు చేసి అవసరం అయితే సబ్ కాంట్రాక్టు ఇచ్చి వేగవంతంగా పనులు పూర్తి చేపిస్తామని ప్రకటించారు. రాబోయే కాలంలో గన్నవరం మరో హైదరాబాద్ గచ్చిబౌలిలా తయారవుతుంది…మల్లవల్లి పారిశ్రామిక వాడ ఈ రాష్ట్రానికి తలమానికం కాబోతుందని వెల్లడించారు. సుమారు 15 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version