వైసీపీ ప్రభుత్వం కోర్టు తీర్పులను ధిక్కరించి దోచుకుంటుంది – కోటంరెడ్డి

-

రాష్ట్రంలో వైసిపి నేతల ఇసుక అక్రమాలు, దోపిడికి పాల్పడుతున్నారని టిడిపి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా నేడు వైసిపి నాయకులు అక్రమంగా మైనింగ్ చేస్తున్న ఇసుక రీచ్ ల వద్ద ఆయా గ్రామస్తులతో కలిసి పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు నేపద్యంలో ఇసుక రీచ్ ల వద్దకు వెళ్లేందుకు టిడిపి శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ఇసుక రీచ్ వద్దకు వెళ్లేందుకు ఎటువంటి అనుమతి లేదని తెలిపారు పోలీసులు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి హయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఇసుక.. వైసిపి హయాంలో ఆకాశాన్ని అంటిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక రేట్లను పెంచి ప్రజలపై భారం మోపుతుందని ఆరోపించారు. కోర్టు తీర్పులను సైతం దిక్కరించి వైసిపి ప్రభుత్వం దోచుకుంటుందన్నారు కోటంరెడ్డి. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version