నేడు వైసీపీ ప్రతినిధుల సభ..హాజరు కానున్న 8,500 మంది

-

నేడు వైసీపీ ప్రతినిధుల సభ జరుగనుంది. ఇవాళ ఉదయం పూట విజయవాడ వేదికగా, వైసీపీ ప్రతినిధుల సభ జరుగనుంది. ఇవాళ ఉదయం 9.30 నిమిషాలకు ప్రారంభం కానుంది సభ. 10.30 నిమిషాలకు సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు సీఎం జగన్. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వైసిపి పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నలుమూలల నుంచి 8,222 మంది హాజరు కానున్నారు.

ycp meeting in jagan
ycp meeting in jagan

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కోఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డు చైర్మన్లు, ఎంపీపీలు, సోషల్ మీడియా కన్వీనర్లు హాజరుకానున్నారు. ఇప్పటికే వీరందరికీ పాస్ లు కూడా అందాయి. ఇవాళ జరుగనున్న వైసీపీ పదాధికారుల సమావేశంలో..ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఇది ఇలా ఉండగా, సీఎం జగన్ కుటుంబ సభ్యుల భద్రత కోసం SSG చట్టం చేశారు. ఈ చట్ట ప్రకారం లండన్ లో ఉన్న సీఎం కుమార్తెలు ఇద్దరికీ అక్కడే స్పెషల్ సెక్యూరిటీ కల్పించనున్నారు. జగన్ సతీమణి భారతి, తల్లి విజయమ్మకు కూడా స్వదేశం, విదేశాల్లో కూడా SSG భద్రత కల్పించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news