BREAKING : వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ సన్యాసం !

-

BREAKING : వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నాడా…అంటే అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూరం కానున్నారట. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చారని సమాచారం.

ప్రస్తుతం తిరుపతి రూరల్ మండలం ఎంపీపీగా కొనసాగుతున్న మోహిత్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్..టికెట్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఎన్నికల కమిటీలో క్రియాశీలక పాత్ర పోషించనున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి…ఎన్నికల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజ్యసభకు వెళతారని జోరుగా ప్రచారం జరిగింది. మోహిత్ రెడ్డికి టిక్కెట్ ఖరారు అయిన నేపథ్యంలో అభిమానుల సందడి చోటు చేసుకుంది. గత రాత్రి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టింది పార్టీ కేడర్. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version