రుషికొండపై నిర్మిస్తోంది సచివాలయమే : వైసీపీ ప్రకటన

-

రుషికొండపై నిర్మిస్తోంది సచివాలయమేనని వైసీపీ పార్టీ ప్రకటన చేసింది. విశాఖ రుషికొండపై నిర్మిస్తోంది సచివాలయమే అని వైసిపి ట్వీట్ ద్వారా తెలిసింది. రుషికొండ తవ్వకాలపై సీఎంను విమర్శిస్తూ టిడిపి ఓ వీడియో పోస్ట్ చేయగా… వైసిపి రిప్లై ఇచ్చింది. ‘ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారు జగన్.

దానిమీద దుష్ప్రచారం చూస్తుంటే మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేదనిపిస్తోంది’ అని పేర్కొంది. ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామా మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకం గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news