ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్‌ భారతి, సమతా రెడ్డి!

-

YS Bharti and Samatha Reddy are rushing in the campaign: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతీ రెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సతీమణి వైయస్ సమతా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మెయిన్ రోడ్, అంబేద్కర్ విగ్రహం, అమ్మవారి శాల వీధి లో ఎన్నికల ప్రచారం చేశారు.

YS Bharti and Samatha Reddy are rushing in the campaign

గడపగడపకు వెళ్లి ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు వైయస్ భారతి రెడ్డి వైయస్ సమతా రెడ్డి. ప్రస్తుత మేనిఫెస్టో లో పొందుపరిచిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి రెండు ఓట్లు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news